News August 16, 2025
పెద్దపల్లి: ‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి’

PDPLలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా కింద 1,51,507 మంది రైతుల ఖాతాల్లో ₹161.02 కోట్లు జమ చేశామని తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలకు ₹155.80 కోట్లు ఆదా అయిందన్నారు. గృహ జ్యోతి, ₹500 గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డులు వంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
Similar News
News August 16, 2025
లింగంపేటలో 977 కేసులు పరిష్కారం

కామారెడ్డి జిల్లాలో భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ పైలెట్ ప్రాజెక్ట్ మంచి ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికైన లింగంపేట మండలంలో ఇప్పటి వరకు 977 భూ వివాదాలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు.
News August 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 16, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.44 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.41 గంటలకు
✒ ఇష: రాత్రి 7.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.