News March 6, 2025

పెద్దపల్లి: ప్రశాంతంగా రెండో రోజు పరీక్షలు

image

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ రెండవ సంవత్సరం మొదటి పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాష పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు (4900) మంది హాజరు కావాల్సి ఉండగా, (4796)మంది హాజరు కాగా,(104) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారన్నారు. 97.87% హాజరు నమోదు కావడం జరిగిందన్నారు.

Similar News

News October 27, 2025

ఆదిలాబాద్: KU.. ఫీజు చెల్లింపుకు నేడే ఆఖరు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 23 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి అవకాశం ఉండగా దానికి ఈనెల 27వరకు పొడగించినట్లు వెల్లడించారు. నవంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కావున ఫీజు చెల్లించని విద్యార్థులు గమనించి నేడు ఫీజు చెల్లించాలని సూచించారు.

News October 27, 2025

వరంగల్: ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఎంతంటే..?

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ.6,925 పలికినట్లు పేర్కొన్నారు. గత వారం రూ.7 వేలకు పైగా పలికిన పత్తి ధర.. నేడు పడిపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.

News October 27, 2025

యోగంలేని ఉద్యోగం నిరుపయోగం..

image

వివిధ సందర్భాల్లో పుట్టపర్తి సత్యసాయి బాబా చెప్పిన సూక్తులు..
★ పితృరుణం తీర్చుకోవాలంటే తిరిగి తల్లి గర్భంలో జన్మించకుండా ఉండే మార్గాన్ని కనిపెట్టాలి
★ మొహమనే నిద్రను వదిలితే సంసారమనేది స్వప్నమని తెలుస్తుంది
★ అందరిలోనూ ఆత్మతత్వం ఒక్కటే. ఇట్టి ఏకత్వాన్ని గుర్తంచిన వారికి ఎట్టి బాధలు ఉండవు
★ యోగంలేని ఉద్యోగం నిరుపయోగం, దైవచింతనయే నిజమైన యోగం, ఉద్యోగం.
#సత్యసాయి శత జయంతి
27 Days Go