News December 8, 2025

పెద్దపల్లి: బిర్యానీ రూ.150.. టీ రూ.5..!

image

పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు జాగ్రత్తగా ఎన్నికల కమిషన్ సూచించిన పరిధిలో ఖర్చు చేయాలి. ఇందుకోసం కమిషన్ ఒక్క బిర్యాని ఖరీదు రూ.150, టీ రూ.5, ఇతర వస్తువుల ధరలు సైతం నిర్ణయించింది. సర్పంచ్ అభ్యర్థులు 5వేలలోపు ఓటర్లుగల గ్రామాలలో రూ.1,50,000, వార్డ్ సభ్యులు రూ.30,000లోపు.. అలాగే 5వేల జనాభా మించితే సర్పంచ్ రూ.2,50,000, సభ్యుడు రూ.50,000లోపు ఖర్చు చేయాలి. ఇవి మించితే అనర్హులే.

Similar News

News December 10, 2025

రాష్ట్రంలో పరువు హత్య!

image

TG: హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో పరువు హత్య కలకలం రేపింది. బీటెక్ స్టూడెంట్ శ్రవణ్ సాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు. అది ఇష్టం లేని యువతి పేరెంట్స్ అతడిని నిన్న హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. అనంతరం సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వారే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 10, 2025

ములుగు జిల్లాలో మొదటి విడత ఎన్నికల సమాచారం

image

జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మూడు మండలాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్పంచ్ స్థానాలు: 39
అభ్యర్థులు: 139
వార్డు స్థానాలు: 287
అభ్యర్థులు: 532
ఓటర్ల సంఖ్య: 68,303
పోలింగ్ కేంద్రాలు: 379
ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
పీవోలు(పోలింగ్ అధికారులు): 525 మంది
ఉప పీవోలు: 652 మంది

News December 10, 2025

గన్నవరం: ‘పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం’

image

ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలలో ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యంపై
గన్నవరం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విమానాల రద్దు, ప్రణాళికలు దెబ్బతిన్న నేపథ్యంలో, పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి విమానాశ్రయ అధికారులు అన్ని విభాగాలతో సమన్వయంగా పనిచేశామని బుధవారం తెలిపారు.