News January 7, 2026
పెద్దపల్లి: ‘మధ్యవర్తిత్వంతోనే సత్వర న్యాయం’

న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు ‘మధ్యవర్తిత్వం’ ఒక గొప్ప ప్రత్యామ్నాయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు భవనంలో ‘మధ్యవర్తిత్వం-మిడియేటర్’ అంశంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం, ధనం ఆదా అవ్వడమే కాకుండా ఉభయ పక్షాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కారం లభిస్తుందని వివరించారు.
Similar News
News January 25, 2026
సింగరేణి సమ్మక్క జాతరకు 30 ఏళ్ల చరిత్ర

గోదావరిఖని పట్టణ శివారులోని గోదావరి నది వంతెన వద్ద వెలసిన సమ్మక్క జాతరకు 30 ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో జాతర సమయంలో కార్మికులు మేడారం వెళ్లడం వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగేది. దీనిని గమనించిన సింగరేణి యాజమాన్యం 1992లో స్థానికంగానే జాతరకు శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి సింగరేణి కార్మిక కుటుంబాల కోసం ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
News January 25, 2026
కృష్ణా: మూడు ఫ్లైఓవర్లు పట్టాలెక్కేనా?

విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రతిపాదించిన 3 కీలక ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం సందిగ్ధంలో పడింది. రాజీవ్ గాంధీ పార్క్-బెంజ్ సర్కిల్, బెంజ్ సర్కిల్-గోశాల, మహానాడు-నిడమానూరు మార్గాల్లో ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నా, అడ్డంకులు ఎదురవుతున్నాయి. NHAI నిబంధనల ప్రకారం CM కార్యాలయం నుంచి ప్రతిపాదనలు వెళ్లాల్సి ఉండగా, ఇప్పటివరకు ముందడుగు పడలేదు.
News January 25, 2026
BRSలో గెలిచా.. కాంగ్రెస్తో పనిచేస్తున్నా: కడియం

TG: ఎమ్మెల్యేల అనర్హతపై వివాదం కొనసాగుతున్న వేళ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్తో పనిచేస్తున్నట్లు తెలిపారు. ‘ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రచారం చేస్తారని అంతా అడుగుతున్నారు. నేను కాంగ్రెస్కే ఓటు వేయాలని చెబుతా. రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉంటారు. ఆయనకు ఎమ్మెల్యేలతోపాటు ప్రజల సపోర్టు ఉంది’ అని చెప్పారు.


