News September 16, 2025

పెద్దపల్లి: ‘మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి’

image

PDPLలో సెప్టెంబర్17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ-సశక్తి పరివార్ అభియాన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతిరోజు ప్రత్యేక వైద్య క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. బాలికల గురుకులాల్లో స్క్రీనింగ్ టెస్టులు, గర్భిణీలకు 100% ANC చెకప్, పౌష్టికాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 16, 2025

HYD: నాన్న.. నీవెక్కడ?

image

నాన్న రాక కోసం ఆ బాలుడు ఎదురుచూపులు ఆపడం లేదు. గుండెకు హత్తుకొని లాలించే తండ్రి కనిపించక చిన్నోడు వెక్కివెక్కి ఏడుస్తోండు. వరదలో గల్లంతైన కొడుకు కోసం తల్లి, భర్త జాడెక్కడా? అని భార్య కన్నీరుపెట్టుకుంటోంది. వినోభానగర్‌లో వరదల్లో కొట్టుకుపోయిన సన్నీ ఫ్యామిలీ విషాద గాథ ఇది. వరదల్లో కొట్టుకుపోయిన అతడి ఆనవాళ్లు 40 గంటలైనా తెలియలేదు. ఆకలి, దూప వదిలి కుటుంబీకులు నాలాల వద్ద పడిగాపులు కాయడం బాధాకరం.

News September 16, 2025

HYD: నాన్న.. నీవెక్కడ?

image

నాన్న రాక కోసం ఆ బాలుడు ఎదురుచూపులు ఆపడం లేదు. గుండెకు హత్తుకొని లాలించే తండ్రి కనిపించక చిన్నోడు వెక్కివెక్కి ఏడుస్తోండు. వరదలో గల్లంతైన కొడుకు కోసం తల్లి, భర్త జాడెక్కడా? అని భార్య కన్నీరుపెట్టుకుంటోంది. వినోభానగర్‌లో వరదల్లో కొట్టుకుపోయిన సన్నీ ఫ్యామిలీ విషాద గాథ ఇది. వరదల్లో కొట్టుకుపోయిన అతడి ఆనవాళ్లు 40 గంటలైనా తెలియలేదు. ఆకలి, దూప వదిలి కుటుంబీకులు నాలాల వద్ద పడిగాపులు కాయడం బాధాకరం.

News September 16, 2025

రేపు పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో వైద్య శిబిరం

image

పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బుధవారం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా. జి.నాగభూషణరావు మంగళవారం తెలిపారు. స్వస్థ నారి శక్తి పరివార్ అభియాన్‌లో భాగంగా ఈ క్యాంపును నిర్వహించనున్నట్లు వివరించారు. మహిళలు, పిల్లల అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఇది చక్కని వేదికన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.