News September 12, 2025

పెద్దపల్లి: రైల్వే ప్రయాణికులకు తిరుపతి వీక్లీ ట్రైన్

image

చర్లపల్లి- రక్సాల్ మధ్య రైలు నం.07051/52 రాకపోకలు సాగిస్తుంది. రైలు నం.07051 ఈనెల 20న తిరుపతి నుంచి ప్రారంభమై ప్రతి శనివారం వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, PDPL, మంచిర్యాలలో స్టాప్లలో ఆగుతూ వెళ్లనుంది. రైలు నం.07052 ఈనెల 23న ప్రారంభమై ప్రతి మంగళవారం రక్సాల్ నుంచి తిరుపతికి రాకపోకలు సాగిస్తుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. పండగల దృష్ట్యా దీనిని వినియోగించుకోవాలన్నారు.

Similar News

News September 12, 2025

2, 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి: సీఎం

image

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘జగన్ ఐదేళ్లలో ఎన్ని కాలేజీలు కట్టారు? కట్టకపోయినా కట్టానని ప్రచారం చేసుకున్నారు. మేము PPP విధానం తెచ్చినా కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే రన్ అవుతాయి. ఓపీ ఫ్రీగా ఉంటుంది. రెండు, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఆపరేట్ అవుతాయి. ఓపెన్ కాంపిటీషన్‌లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఎక్కువగా ఉంటాయి’ అని Way2News కాన్‌క్లేవ్‌లో తెలిపారు.

News September 12, 2025

భార్యాభర్తలు మొబైల్‌ను వదిలి ఉండలేరేమో: చంద్రబాబు

image

AP: ఫోన్ల వాడకంపై CM చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. ఒకప్పుడు తాను ప్రతి ఒక్కరికీ మొబైల్ అంటే నవ్వేవారని గుర్తుచేశారు. ‘ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భార్యను వదిలి భర్త, భర్తను వదిలి భార్య కాసేపైనా ఉంటారేమో గానీ సెల్‌ఫోన్ వదిలి ఉండలేకపోతున్నారు(నవ్వుతూ). టెలికం విప్లవంపై అప్పటి PM వాజ్‌పేయీ, FM మాత్రమే నా విజన్ అర్థం చేసుకున్నారు’ అని Way2News కాన్‌క్లేవ్‌లో తెలిపారు.

News September 12, 2025

బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం ఏమన్నారంటే?

image

AP: భవిష్యత్తు కోసమే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును తలపెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నీళ్లు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుంది. రాయలసీమకు నీళ్లు ఇస్తే దేశంలోనే నం.1గా మారుతుంది. గోదావరిలో పైన ఉండే నీటిని తెలంగాణ వాడుకోవచ్చు. మేము సముద్రంలోకి వెళ్తోన్న నీటినే వాడుకుంటాం. అందుకే బనకచర్ల కట్టాలని ప్రతిపాదించాం’ అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో చెప్పారు.