News April 5, 2025

పెద్దపల్లి వాసులూ.. అప్లై చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను పెద్దపల్లి జిల్లాలోని MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News July 4, 2025

గద్వాల: రోశయ్య ఆర్థిక పరిపాలన ఆదర్శం: కలెక్టర్

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆర్థిక పరిపాలనలో చూపిన సామర్థ్యం ఆదర్శణీయమని కలెక్టర్ బి.ఎం.సంతోశ్ అన్నారు. శుక్రవారం రోశయ్య జయంతి సందర్భంగా ఐడీఓసీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి, ఉపాధి, విద్య, వైద్యం, అభివృద్ధి లక్ష్యాలతో సమతుల రోడ్‌మ్యాప్ రూపొందించారని కొనియాడారు.

News July 4, 2025

ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్‌పై ఫైన్ లేదు

image

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, BOB జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలిపాయి. SBI 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్‌పై రుసుమును ఎత్తివేసింది. మిగతా బ్యాంకులు సైతం ఇదే పంథాలో ముందుకెళ్లాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.

News July 4, 2025

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన KMR కలెక్టర్

image

రాజంపేట మండలం తలమడ్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తనతో నేరుగా చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణ, తహశీల్దార్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.