News April 5, 2025

పెద్దపల్లి వాసులూ.. అప్లై చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను పెద్దపల్లి జిల్లాలోని MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News April 5, 2025

HYD: ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ ఆత్మహత్య

image

HYDలో విషాదం నెల‌కొంది. క‌వాడిగూడ‌లోని సీసీజీవో ట‌వ‌ర్స్‌లోని 8వ అంత‌స్తు నుంచి కింద‌కు దూకి ఓ అధికారిణి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌య‌ల‌క్ష్మిగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

News April 5, 2025

మరో యువతిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

image

AP: విశాఖలో <<15969970>>ప్రేమోన్మాది దాడి<<>> ఘటన మరువకముందే విజయనగరం(D) శివరాంలో అఖిల అనే యువతిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మంకీ క్యాప్ ధరించి ఇంట్లోకి ప్రవేశించిన అతను అఖిల కడుపులో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని స్థానికులు విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమా? మరేదైనా కారణమా? అని దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2025

8న అనంత జిల్లాలో జగన్ పర్యటన

image

AP: వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి(మ) పాపిరెడ్డిపల్లిలో ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు మాజీ సీఎం.

error: Content is protected !!