News August 22, 2025

పెద్దపల్లి: ‘విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలి’

image

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హై స్కూల్ విద్యాబోధనపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు. 6-9వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టులను బేసిక్ స్థాయిలో, సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, పాఠ్యాంశాలపై కనీస పరిజ్ఞానం 80% విద్యార్థులకు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి TLM తయారీ, బోధన విధానాల మెరుగుదల సూచనలపై జిల్లా విద్యాశాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

Similar News

News August 22, 2025

కృష్ణా: కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన

image

జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు నేతృత్వంలో సర్టిఫికెట్స్ పరిశీలన జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ.. అభ్యర్థుల విద్యార్హతలు, క్రీడా సర్టిఫికేట్లు, కేటగిరీకి సంబంధించిన ధ్రువపత్రాలు సహా అన్ని అవసరమైన పత్రాలను సక్రమంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

News August 22, 2025

ప్రకాశం: కానిస్టేబుల్ అభ్యర్థుల పత్రాల పరిశీలన.. 22 మంది గైర్హాజరు.!

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి 327 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సాగిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి అభ్యర్థులు ఉదయం నుంచే హాజరయ్యారు. అయితే 22 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు.

News August 22, 2025

FLASH: శామీర్‌పేట్ చెరువులో యువకుడి మృతదేహం కలకలం

image

శామీర్‌పేట్ పెద్ద చెరువులో పడి ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీశారు. మృతుడు చెరుకూరి రసూల్(25)గా గుర్తించామని తెలిపారు. మృతుడు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద నివాసం ఉంటున్నట్లు చెప్పారు.