News March 10, 2025
పెద్దపల్లి: 10వ తరగతి పరీక్షల నిర్వహణపై DEO సమీక్ష

10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టరేట్ సీ విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, DEO మాధవి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో తెలిపారు. మార్చి 21నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహించాలన్నారు. జిల్లాలో పరీక్షల కోసం 41 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు.
Similar News
News March 10, 2025
పార్వతీపురం: ఓపెన్ టెన్త్ పరీక్షల హాల్ టికెట్ల విడుదల

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం మార్చి 17వ తేదీ నుంచి నిర్వహించు ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలు, మార్చి 2025కు సంబంధించిన అభ్యాసకుల హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్స్ నుంచి పొందవచ్చని DEO డా. యన్. తిరుపతినాయుడు తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హాల్ టికెట్లను వాట్సాప్-మన మిత్ర లేదా అధికారిక వెబ్ సైట్ apopenschool.ap.gov.in నందు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
News March 10, 2025
కరీంనగర్: వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: RTC JAC

కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆర్టీసీ జేఏసీ రీజియన్ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని, సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వెంటనే ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ అంశాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈ.వెంకన్న తదితరులున్నారు.
News March 10, 2025
KNR జోన్ రీజనల్ మేనేజర్లతో జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం

KNR బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో KNR జోన్ పరిధిలోని అన్ని రీజియన్లకు సంబంధించిన రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్స్, KNR, WGL, NZB డిపో మేనేజర్లు, అధికారులతో KNR జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్, ఇటీవల KNR, NZB, WGL లో ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్సుల పనితీరును సమీక్షించారు.