News March 2, 2025

పెద్దపల్లి: 100 శాతం ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని 13 గ్రామీణ మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు 100% గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1930 మంది క్రమబద్దీకరణ లేని స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. మార్చి 31లోపు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుంలో 25శాతం రాయితీ లభిస్తుందన్నారు. PSలు, MPOలు, DPOలు మోటివేట్ చేస్తూ పేమెంట్ అయ్యేలా చూడాలన్నారు.

Similar News

News February 20, 2026

మానుకోట రాళ్ల దాడి.. రగిలించిన ఉద్యమ వేడి!

image

తెలంగాణ మలిదశ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక చరిత్ర ఉంది. సమైక్యాంధ్ర వాది Y.S.జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకునే క్రమంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సమైక్యాంధ్ర వాదులపై రాళ్ల వర్షం కురిపించారు. తెలంగాణ వాదులు ఆనాడు మానుకోటలో జరిగిన రాళ్ల దాడి యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా చేసి స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసింది. అప్పటి ప్రభుత్వం రాళ్ల వర్షం కురిపించిన తెలంగాణ వాదులపై పోలీసు కేసులు పెట్టింది.

News February 20, 2026

అమరావతికి సిద్ధం కానున్న అసలైన మణిహారం

image

అమరావతికి అసలైన మణిహారం సిద్ధమవుతోంది. రూ.40,847 కోట్ల భారీ వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. మొత్తం 96.2 కిలోమీటర్ల పొడవుతో, 75 మీటర్ల భారీ వెడల్పుతో ఈ రహదారిని డిజైన్ చేశారు. ఇది 8+4 వరుసల (Lanes) కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది. అంటే ప్రధాన ప్రయాణం కోసం 8 వరుసల రహదారి ఉంటే, స్థానిక రవాణా కోసం అధనంగా మరో 4 వరుసల సర్వీస్ రోడ్లు ఉంటాయి.

News February 20, 2026

MBNR: ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ, 3వ తరగతి ఎఫ్‌ఎల్‌ఎన్/ ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షల సిద్ధతపై దృష్టి పెట్టాలని డీఈవో సూచించారు.