News March 16, 2025
పెద్దపల్లి: 30న అఖిల భారత యాదవ మహాసభ

ఈనెల 30వ తేదీన అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహాసభలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News March 16, 2025
ఈ నెల 18న ఢిల్లీకి చంద్రబాబు!

AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని ఆయనను ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
News March 16, 2025
కర్నూలు: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠాశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదివారం తెలిపారు. ఈ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థులను యూనిఫామ్తో పరీక్షలకు పంపితే, ఆ పాఠశాలల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News March 16, 2025
జిల్లా అధికారులను అభినందించిన జనగామ కలెక్టర్

స్టేషన్ ఘనపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను జిల్లా అధికారులందరినీ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అభినదించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు గత వారం రోజులుగా నిర్విరామంగా విశేష కృషి చేశారని కలెక్టర్ అన్నారు. అందరి సమన్వయ కృషి వల్లే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.