News April 14, 2024
పెద్దముడియం: భార్య గొంతు కోసి హత్యచేసిన భర్త

పెద్దముడియం మండలంలోని దిగువ కల్వటాల గ్రామంలో భార్యను ఆమె భర్త గొంతు కోసి హత్య చేశాడు. దిగువ కల్వటాలకు చెందిన ఆదిలక్ష్మికి మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన మేనమామ సహదేవుడితో 15 ఏళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదిలక్ష్మి 2 నెలలుగా పుట్టింటి వద్ద ఉంటోంది. భార్య సంసారానికి రాలేదన్న కోపంతో శనివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న ఆదిలక్ష్మిని భర్త కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
Similar News
News October 7, 2025
పులివెందులలో MP అవినాశ్ ప్రజా దర్బార్

కడప పార్లమెంట్ సభ్యుడు YS అవినాశ్రెడ్డి సోమవారం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలను ఎంపీకి తెలియజేశారు. ప్రజల ఆవేదనను ఆలకించిన అవినాశ్రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ వీరివెంట ఉన్నారు.
News October 6, 2025
కడప: వీళ్లకు నామినేటెడ్ పదవులు లేనట్లేనా?

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా కడప జిల్లాలోని పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు లభించలేదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టికెట్లు ఆశించి భంగపడ్డ భూపేశ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్లకు ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులు వస్తాయని వారి వర్గీయులు ఆశించారు. అయినా వీరికి ఏ ఒక్క పదవి దక్కలేదు. ఇక బద్వేల్, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్లు రితేశ్ రెడ్డి, బీటెక్ రవిలు కూడా పదవులు ఆశించిన వారిలో ఉన్నారు.
News October 6, 2025
కడప: వీళ్లకు నామినేటెడ్ పదవులు లేనట్లేనా?

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా కడప జిల్లాలోని పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు లభించలేదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టికెట్లు ఆశించి భంగపడ్డ భూపేశ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్లకు ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులు వస్తాయని వారి వర్గీయులు ఆశించారు. అయినా వీరికి ఏ ఒక్క పదవి దక్కలేదు. ఇక బద్వేల్, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్లు రితేశ్ రెడ్డి, బీటెక్ రవిలు కూడా పదవులు ఆశించిన వారిలో ఉన్నారు.