News January 29, 2025

పెద్దాపురం: ప్రేమ పేరుతో పెళ్లి..వ్యభిచారం చేయాలని ఒత్తిడి

image

ప్రేమ‌ పేరుతో మైనర్ బాలికను పెళ్లి చేసుకుని, ఆపై వ్యభిచారం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దాపురానికి చెందిన చందుకి అనకాపల్లికి చెందిన బాలిక (17) తుని రైల్వేస్టేషన్‌లో పరిచయమైంది. ప్రేమ పేరుతో వల వేసి పెళ్లి చేసుకుని డబ్బుల కోసం భర్త చందు, అత్త నీలిమ వ్యభిచారంలోకి దింపే ప్రయత్నం చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదుచేశామని వి.మౌనిక తెలిపారు.

Similar News

News February 23, 2026

ప.గో: ‘ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి లేదు’

image

జిల్లా వ్యాప్తంగా నేడు నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు అని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి 37,550 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 8:30కు హాజరు కావాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని హెచ్చరించారు.

News February 23, 2026

పబ్బతి ఆలయ ప్రసాదంపై భక్తుల అసహనం

image

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు అందజేస్తున్న లడ్డూ ప్రసాదంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిమాణంతోపాటు నాణ్యత విషయంలో లడ్డూ బరువును తగ్గించడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ దారులు లాభాపేక్షతో ప్రసాదం బరువు తగ్గిస్తున్నారా? అనే అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రం ప్రతిష్ఠను కాపాడాలని వారు కోరుతున్నారు.

News February 23, 2026

APలో కలకలం.. మూత్రం ఆగి ఇద్దరు మృతి?

image

తూర్పు గోదావరి(D) <<19212464>>రాజమండ్రిలో<<>> అనూరియా(మూత్రం ఆగిపోవడం) కేసులు కలకలం రేపాయి. ఇప్పటివరకు ఇద్దరు చనిపోగా ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ పాలు తాగడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయనే ప్రచారం జరగడంతో పోలీసులు వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు పాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.