News November 19, 2025
పెద్దారవీడు వద్ద ఎద్దుల అరకలను ఢీకొని దోర్నాల వ్యక్తి మృతి

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 21, 2026
చదివేది సింగరాయకొండ.. హాజరు కనిగిరి

సింగరాయకొండ చైతన్య పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన తౌషిక్ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తౌషిక్ మరణించిన తర్వాత శుక్రవారం రోజు కూడా కనిగిరిలో ప్రగతి విద్యా నిలయంలో పాఠశాలకు వచ్చినట్లు హాజర వేశారు. త్రిసభ్య కమిటీలో ఉన్న డీఈవో రేణుక ఇది గమనించి అవాక్కయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కౌశిక్ తల్లిదండ్రులు అంటున్నారు.
News February 21, 2026
APK ఫైల్స్, లింకులను ఓపెన్ చేయొద్దు: కనిగిరి DSP

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి DSP సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. ఈ మధ్య కాలంలో SBI పేరుతో Aadhaar KYC Update”, “SBI Aadhaar Update.apk”వంటి ఫైళ్లు, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు వస్తున్నాయని తెలిపారు. APK ఫైల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ లేదా క్లిక్ చేయకూడదని స్పష్టం చేశారు.
News February 21, 2026
CM వెలిగొండ పర్యటనపై కీలక సమావేశం

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రాజెక్ట్ పరిసరాల్లో చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. అలాగే ఎల్లుండి సీఎంతో సమావేశం నేపథ్యంలో వివరించాల్సిన అంశాలపై మాట్లాడుకున్నారు.


