News July 1, 2024
పెద్దిరెడ్డి అరాచకాలపై క్యాసెట్ పంపిస్తా: బాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719810445441-normal-WIFI.webp)
పుంగనూరులో అధికార పార్టీ దాడులు ఎక్కువైనట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలపై TDP ఇన్ఛార్జ్ చల్లా బాబు స్పందించారు. ‘గత రెండేళ్లలో పుంగనూరులో ప్రతిపక్షాలపై మీ నాన్న పెద్దిరెడ్డి చేసిన దాడులు ఏంటో తెలుసుకోవాలి. మా కార్యకర్తలపై 307 కేసులు పెట్టారు. పుంగనూరులో మీ అరాచకాలను క్యాసెట్ రూపంలో పంపమంటే పంపిస్తా. మీ దాడులకు టీడీపీ నేతలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు’ అని బాబు అన్నారు.
Similar News
News July 3, 2024
TDP నాయకుల వేధింపులకు యువకుడి బలి: YCP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719972498931-normal-WIFI.webp)
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అయ్యవార్లగొల్లపల్లెలో కేశవ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కేశవ తల్లికి పింఛన్ ఆపేసి టీడీపీ నాయకులు వేధించారు. అతి తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పెన్షన్ అడిగిన కొడుకును టీడీపీ బలితీసుకుంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కడుపు నొప్పి భరించలేక తన సోదరుడు పురుగు మందు తాగాడని కేశవ అన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News July 3, 2024
తిరుపతిలో DSCకి ఉచిత శిక్షణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719967182745-normal-WIFI.webp)
తిరుపతిలోని స్టడీ సర్కిల్లో డీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ, సాధికారత అధికారి రబ్బానీబాషా వెల్లడించారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు అర్హులని చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు తిరుపతిలోని బీసీ స్టడీ సర్కిల్ను సంప్రదించాలని కోరారు.
News July 3, 2024
చిత్తూరు: జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719927055387-normal-WIFI.webp)
కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎస్పీ మణికంఠ సూచించారు. పోలీసు అధికారులతో మంగళవారం ట్రైనింగ్ సెంటర్లో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కల్పించాలన్నారు. అక్రమ రవాణా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.