News July 31, 2024

పెద్దిరెడ్డి 20వేల ఎకరాలు కబ్జా చేశారు: మంత్రి

image

రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామచంద్రారెడ్డి, ఆయన ముఠా దాదాపు 20 వేల ఎకరాలు కబ్జా చేశారని, వాటి విలువ రూ.45 వేల కోట్లు ఉంటుందన్నారు. దీనిని తప్పించుకోవడానికే మదనపల్లె ఆర్డీవో కార్యలయంలో 22A ఫైళ్లు దగ్ధం చేశారన్నారు. మొత్తం 14 వేల ఎకరాలకు సంబంధించి ఫైళ్లు బూడిదయ్యాయన్నారు. అంతే కాకుండా పెద్దిరెడ్డికి చెందిన కంపెనీ PLR కు చెందిన టిప్పర్లపై విచారణ చేపడతామన్నారు.

Similar News

News September 18, 2025

చిత్తూరు: రెండేళ్ల క్రితం హత్య.. ఇప్పుడు వెలుగులోకి

image

బంగారుపాళ్యం(M) బలిజపల్లికి చెందిన చెంచులక్ష్మి భర్త చనిపోగా శేషాపురానికి చెందిన దేవేంద్రతో వివాహేతర బంధం ఏర్పడింది. పెనుమూరు(M) సామిరెడ్డిపల్లిలోని ఓ మామిడి తోటలో కాపలా పనికి 2023లో ఇద్దరు వచ్చారు. అప్పట్లోనే వాళ్ల మధ్య గొడవ జరగ్గా చెంచులక్ష్మిని దేవేంద్ర నీటిలో ముంచి చంపేశాడు. తోటలోనే డెడ్‌బాడీని పాతిపెట్టి ఆమె ఎటో వెళ్లిపోయిందని మృతురాలి తల్లిని నమ్మించాడు. పోలీసులు నిన్న అతడిని అరెస్ట్ చేశారు.

News September 18, 2025

అక్టోబర్ 4లోపు దరఖాస్తు చేసుకోండి: DMHO

image

పారామెడికల్ ట్రైనింగ్ 2025-26 కోర్సుల్లో ఉచిత ప్రవేశానికి అక్టోబర్ 4 వరకు గడువు పెంచినట్లు DMHO సుధారాణి బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.appmb.co.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్లను జత చేసి రూ.100లను DMHO కార్యాలయంలో అందించాలన్నారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News September 18, 2025

విద్యార్థిపై దాడి.. పవన్ కళ్యాణ్ విచారం

image

పుంగనూరులోని ఓప్రైవేటు స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి తల ఎముక చిట్లడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. స్కూల్, ఇంట్లో పిల్లలు అల్లరి చేయడం లాంటివి చేస్తే వారి మానసిక ధోరణిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థికి సమస్యలు తలెత్తడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని బుధవారం అధికారులను ఆదేశించారు.