News March 28, 2024
పెద్ద కొడప్గల్: ఎస్సై పై దాడి చేసిన వారిపై కేసు

పెద్ద కొడప్గల్ ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై దాడికి పాల్పడిన దుండగులను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బిచ్కుంద ఎస్సై తెలిపారు. బేగంపూర్ గేటు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై కాస్లాబాద్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మద్యం తాగి వచ్చి గొడవకు దిగి, దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.
Similar News
News February 28, 2025
NZB: మార్చ్1న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చ్1న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.విజయ్ కాంత్ రావు తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్ వద్ద ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అండర్ 14, 16, 18 బాలికలతో పాటు మహిళ, పురుషులకు వేరువేరుగా ఎంపికలు ప్రక్రియ ఉంటుందన్నారు. ఎంపికైన వారిని హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు.
News February 28, 2025
NZB: జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

NZB జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 81 కేంద్రాలు ఉండగా, పట్టభద్రులకు సంబంధించి 48, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయ నియోజకవర్గానికి 92.46% పోలింగ్ నమోదు కాగా, పట్టభద్రులకు సంబంధించి సంబంధించి 77.24% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. బ్యాలెట్ బాక్స్లను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించారు.
News February 28, 2025
NZB: ఇంటర్ పరీక్షలపై సన్నాహక సమావేశం: DIEO

2024-25 విద్యా సంవత్సరం ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్ (CS)లు, డిపార్ట్మెంటల్ అధికారుల(DO) సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి (DIEO) రవికుమార్ తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు నిజామాబాద్ ప్రభుత్వ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలలో సమావేశం ఉంటుందని అందరూ హాజరుకావాలని ఆయన కోరారు.