News April 1, 2024

పెనమలూరులో మంత్రి జోగి గెలిస్తే చరిత్రే!

image

పెనమలూరు వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ మంత్రి పదవిలో ఉంటూ ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2019 ఎన్నికలు అప్పటి మంత్రులైన కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాకు చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి. 2019లో పెడన నుంచి గెలిచిన మంత్రి జోగిని సైతం సీఎం జగన్ పెనమలూరుకు బదిలీ చేయగా, టీడీపీ తమ అభ్యర్థిగా పెనమలూరులో బోడె ప్రసాద్‌ను నిలబెట్టింది. ఇక్కడ జోగి విజయం సాధిస్తారా.. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

Similar News

News September 8, 2025

MTM: మీకోసం కార్యక్రమంలో 42 ఫిర్యాదులు

image

మచిలీపట్నంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, ప్రతి సమస్యపై చట్టపరమైన విచారణ జరిపి తక్షణ పరిష్కారం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

News September 8, 2025

యూరియా సరఫరాకు పటిష్ట చర్యలు: కలెక్టర్

image

యూరియా సరఫరాపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం CM చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ యూరియా సరఫరాకు జిల్లాలో చేపట్టిన చర్యలను సీఎంకు వివరించారు.

News September 8, 2025

శ్రీరామపాద క్షేత్రంలో సుందర దృశ్యం

image

నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రంలో ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ఇటీవల కృష్ణానది వరదలకు శివలింగం, నంది వాహనం పూర్తిగా మునిగిపోయాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఆలయాన్ని ప్రక్షాళన చేశారు. అనంతరం భక్తుల సందర్శన కోసం సిద్ధం చేయగా, సాయం సంధ్య వేళ రంగుల వర్ణాలతో ఆలయం ప్రత్యేకంగా కనిపించింది. ఈ సుందర దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.