News April 6, 2025

పెనమలూరు: కలకలం రేపిన మహిళ అనుమానాస్పద మృతి  

image

యనమలకుదురు లంకలలో ఓ మహిళ మృతదేహం కనపడటం కలకలం రేపింది. శనివారం ఉదయం ముళ్లకంపల్లో గులాబీ చీర, జాకెట్‌లో ఆమె శవమై కనిపించింది. కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, మోచేతికి పచ్చబొట్టు ఉండటంతో అనుమానాలు పెరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో విచారణ ప్రారంభించారు. ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వస్తున్నాయి. 

Similar News

News February 22, 2026

గుడివాడ: ఫీజు రాయితీపై ప్రైవేట్ స్కూళ్ల మొండికేత

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ, గుడివాడలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు వీటిని బేఖాతరు చేస్తున్నాయి. మాకు ఆ జీవోల గురించి తెలియదు అంటూ యాజమాన్యాలు తప్పించుకుంటున్నాయని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. MEO పలుమార్లు సూచించినా, స్కూళ్లలో విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తూనే ఉన్నారని ఆరోపిస్తున్నారు.

News February 22, 2026

కృష్ణా: ఈ మాస్టారు రూటే సెపరేటు..!

image

కోడూరు మండలం ఉల్లిపాలెం ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్నారు. పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులను నేరుగా ప్రకృతిలోకి తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నారు. చేపల సాగు, మడ అడవుల సంరక్షణ, వ్యవసాయ పద్ధతులపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు సైన్స్ అంశాలను ఎంతో సులభంగా అర్థం చేసుకుంటున్నారు.

News February 22, 2026

గుడివాడ: రైలులో మర్చిపోయిన రూ.14 లక్షల సొత్తు అప్పగింత

image

విశాఖ నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలులో వరలక్ష్మి అనే మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌ను మర్చిపోయి భీమవరం టౌన్‌లో దిగిపోయారు. బాధితురాలి సమాచారంతో గుడివాడ రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ్ సిబ్బందితో కలిసి వెంటనే అప్రమత్తమయ్యారు. రైలు గుడివాడ రాగానే తనిఖీలు చేసి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులోని 110 గ్రాముల బంగారం, రూ. 5వేల నగదు, మొబైల్ ఫోన్‌ను (మొత్తం విలువ రూ.14 లక్షలు) పోలీసులు బాధితురాలికి అందజేశారు.