News August 24, 2025
పెనమలూరు: కీలిమంజారో విజయం.. కలెక్టర్ ప్రశంస

పెనమలూరు మండలానికి చెందిన అనుమోలు ప్రభాకరరావు ఇటీవల ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. శనివారం ఆయన కలెక్టర్ డి.కె. బాలాజీ కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ ఘట్టం ప్రేరణగా, యువతలో జైవిక, పర్యాటక అవగాహన పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News August 25, 2025
విగ్రహాల ఏర్పాటు అనుమతులకు నేడు చివరి తేదీ: DSP

వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం చివరి రోజు అని మచిలీపట్నం డీఎస్పీ సి.హెచ్. రాజా ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు సాయంత్రం 4 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 450 విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
News August 25, 2025
మచిలీపట్నం: నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News August 24, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ మోపిదేవిలో మహిళ ఆత్మహత్య
☞ మచిలీపట్నంలో రేపు గ్రివెన్స్: కలెక్టర్
☞ మచిలీపట్నంలో సైకిల్ చేసిన ఎస్పీ
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
☞ జాతియ స్థాయిలో నాగాయలంక క్రీడాకారుల సత్తా
☞ సెప్టెంబర్ 7న దుర్గ గుడి మూసివేత
☞ కృత్తివెన్నులో ఇద్దరు యువకులపై ఫోక్సో కేసు