News March 1, 2025

పెనుబల్లి: చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

image

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం కలకలంరేపింది. మద్యం మత్తులో ఉన్న దుంప వెంకటేశ్వరరావు చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వీ.ఎం.బంజర్ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 12, 2025

15న తిరుపతిలో జాబ్ మేళా

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌(MCC)లో 15వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 3కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని కార్యాలయ అధికారి శ్రీనివాసులు చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, MBA పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు రావలని కోరారు.

News November 12, 2025

వనపర్తి: ‘రెవెన్యూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి’

image

రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సు ద్వారా 41,100 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 30,672 ఎకరాల కవరేజీ ఉందని తెలిపారు. ఇప్పటివరకు 5,863 ఎకరాలు అప్‌డేట్ చేసినట్లు చెప్పారు.

News November 12, 2025

జగిత్యాల: కొనుగోలు ధాన్యం మిల్లులకు తరలించాలి: కలెక్టర్

image

కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆయన కొడిమ్యాల మండలంలోని పూడూరు, నాచుపల్లి, డబ్బు తిమ్మయ్యపల్లి కేంద్రాలను పరిశీలించారు. నాణ్యతతో ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరపాలని సూచించారు. తేమ 17% వచ్చేవరకు ఆరబెట్టి కేంద్రాలకు తేవలని రైతులకు విజ్ఞప్తి చేశారు.