News March 16, 2025
పెనుబల్లి: మేక పంచాయితీ.. దాడి, ఫిర్యాదు.!

మేక తెచ్చిన పంచాయితీలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన కొందరు యువకులు కారులో టేకులపల్లి సాగర్ కాల్వ వద్ద ఈత కొడుతుండగా, అటుగా వచ్చిన మేకల గుంపులోని ఓ మేక కారుపై ఎక్కడంతో, పశువులు కాపరిని యువకులు కొట్టారు. అది గమనించిన స్థానికులు యువకులను కొట్టడంతో మారేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News December 30, 2025
జగిత్యాల్: 5 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు

రాయికల్ మండలంలోని కిష్టంపేటకు ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్టీసీ బస్సు సర్వీసు పునఃప్రారంభమైంది. కరోనా కాలంలో బస్సు సర్వీసు నిలిపేయగా మళ్లీ ప్రారంభించాలని గ్రామస్థులు ఏన్నో సార్లు కోరారు. ఇటీవల సర్పంచ్ అంజయ్య పాలకవర్గం DMకు వినతిపత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించారు. మంగళవారం గ్రామానికి చేరుకున్న బస్సుకు సర్పంచ్, ప్రజలు ఘనస్వాగతం పలికారు. రవాణా కష్టాలు తీరడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 30, 2025
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం

TG: శాసన సభలో బీఆర్ఎస్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీశ్ రావు, సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని, విప్గా దేశపతి శ్రీనివాస్ను నియమించారు.
News December 30, 2025
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.


