News March 16, 2025
పెనుబల్లి: మేక పంచాయితీ.. దాడి, ఫిర్యాదు.!

మేక తెచ్చిన పంచాయితీలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన కొందరు యువకులు కారులో టేకులపల్లి సాగర్ కాల్వ వద్ద ఈత కొడుతుండగా, అటుగా వచ్చిన మేకల గుంపులోని ఓ మేక కారుపై ఎక్కడంతో, పశువులు కాపరిని యువకులు కొట్టారు. అది గమనించిన స్థానికులు యువకులను కొట్టడంతో మారేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News October 30, 2025
GWL: ‘నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి’

గద్వాలలో రూ.33.02 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో నర్సింగ్ కాలేజీ, విద్యార్థి వసతి గృహ ఏర్పాట్ల పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.130 కోట్లతో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు.
News October 30, 2025
బెల్లంపల్లి ఏరియాలో సీఎంఓ పర్యటన

బెల్లంపల్లి ఏరియా గోలేటి, మాదారం చీఫ్ మెడికల్ అధికారి కిరణ్ రాజు గురువారం పర్యటించారు. ఏరియా ఆసుపత్రిలో వసతులు, ల్యాబ్లను తనిఖీ చేశారు. నిత్యం ఎంత మంది ఉద్యోగులు చికిత్స కోసం వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. పునరావాస కాలనీల్లో మొబైల్ హెల్త్ క్యాంప్ ద్వారా అందించే వైద్య సేవలను కొనసాగించాలని పేర్కొన్నారు.
News October 30, 2025
రాయికల్: ‘రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు’

జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా వరి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత సూచించారు. రాయికల్ మండలం అల్లీపూర్, సింగారావుపేట, జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామాల్లోని ప్యాక్స్, ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. రైతుల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


