News December 9, 2025

పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

image

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.

Similar News

News February 10, 2026

చిత్తూరు జిల్లాలో విషాదం

image

నెల్లిపట్ల గ్రామ పంచాయతీ కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన యానాది గజేంద్ర (31) ప్రమాదవశాత్తు బావిలోకి దిగి మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన మున్నెప్ప వ్యవసాయ బావిలోకి మోటర్ మరమ్మతుకై దిగుతుండగా గజేంద్ర కాలుజారి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News February 10, 2026

ఎల్లుండి నుంచి మొగిలిలో బ్రహ్మోత్సవాలు

image

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలోని స్వయంభు మొగిలేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 12వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో మునిరాజా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పారు.

News February 10, 2026

చిత్తూరు జిల్లాలో కష్టంగా పశుపోషణ…!

image

చిత్తూరు జిల్లాలో చలికాలం కావడంతో పశుపోషణ రైతులకు తీవ్ర భారంగా మారింది. చలి కారణంగా పచ్చి గడ్డి త్వరగా పెరగడం లేదు. పశువుల మేతకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఎండు గడ్డిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గడ్డి మోపు ధర ఒక్కటి రూ.300 వరకు పలుకుతోంది. దీంతో రైతులు పశువులను పోషించడమే భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల రేట్లు తక్కువగా ఉండటంతో పశుపోషణ కష్టంగా మారింది.