News December 29, 2025
పెన్షన్ పంపిణీ తేదీ మార్పు

జనవరి 1న ఇవ్వాల్సిన పెన్షన్లను డిసెంబర్ 31న ఇంటివద్దకే వెళ్లి పంపిణీ చేయాలని అధికారులను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. పెన్షన్ పంపిణీ సజావుగా జరిగేలా కంట్రోల్ రూమ్ల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. పెన్షన్ పంపిణీలో ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News January 2, 2026
వాస్తు మన సౌభాగ్యానికి తొలి మెట్టు

వాస్తు నియమాలు పాటించే ఇంట్లో సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సరైన వాస్తు వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడి, మనసులో ప్రభావవంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటున్నారు. ‘ఇవి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఆదాయ వృద్ధికి బాటలు వేసి సకల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తాయి. అంతిమంగా ఇవి ఆనందాన్ని, మానసిక సంతృప్తిని అందిస్తాయి. వాస్తు అభ్యున్నతికి ఆధారం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 2, 2026
పేదల కోసం నిలబడకుండా వెళ్లిపోయారు: భట్టి

TG: ఉపాధి హామీ పథకంపై సభలో మాట్లాడకుండా BRS నేతలు వెళ్లిపోవడం విచారకరమని Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘కోట్లాది మంది నిరుపేదల కోసం BRS అలియాస్ TRS నేతలు మాట్లాడాల్సింది. కానీ, వాళ్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పేదలను వదిలేశారు. ఈ చట్టాన్ని మార్చకూడదని, పాతదే కొనసాగించాలని చాలా రాష్ట్రాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. మనమూ అలాంటి తీర్మానం చేసి పేదల పక్షాన నిలబడదాం’ అని విజ్ఞప్తి చేశారు.
News January 2, 2026
‘ఉపాధి’కి గాంధీ పేరు కొనసాగించాలంటూ సభలో తీర్మానం

TG: ఉపాధి హామీ పథకంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మహాత్మా గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే కొత్తగా తెచ్చిన రూల్స్ వల్ల రాష్ట్రాలకు నష్టం కలుగుతోందన్నారు. ఉపాధి పనులకు గతంలో కేంద్రమే 100% నిధులు కేటాయించేదని, ఇప్పుడు 60-40 శాతానికి మార్చడం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని మండిపడ్డారు. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.


