News March 21, 2025

పెబ్బేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు: ఎస్ఐ 

image

అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోనేల ఎల్లయ్య, బొడ్డుపల్లి రాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గురువారం తెలిపారు. సర్వే నంబర్‌పై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వారు ప్లాట్లు విక్రయించారని గద్వాల్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News February 17, 2026

మక్తల్: 6వ వార్డు అభ్యర్థిగా ఎరుకల సత్యమ్మ

image

మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు BJP అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఓటింగ్ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. కాగా తాజాగా అక్కడి నుంచి దివంగత మహదేవప్ప భార్య ఎరుకల సత్యమ్మ పోటీ చేస్తుందని BJP కార్యవర్గ సభ్యులు కొండయ్య తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తనపై పార్టీ నుంచి గాని ఇతరుల నుంచి గాని ఎటువంటి ఒత్తిడి లేదని తన భర్త ఆశయాలకై తానే స్వయంగా బరిలో దిగుతున్నానని స్పష్టం చేశారు.

News February 17, 2026

KNR: ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

కొత్తపల్లి మండలంలోని చింతకుంట, మల్కాపూర్ డీసీఎంఎస్ ఎరువుల దుకాణాలు, గోదాములను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకాలు మరియు నిల్వల రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. యూరియా కొనుగోలుకు వచ్చిన రైతులతో మాట్లాడి, బుకింగ్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News February 17, 2026

100 ఎకరాల్లో జినోమ్ వ్యాలీ ఫేజ్-4: శ్రీధర్ బాబు

image

TG: జినోమ్ వ్యాలీని విస్తరిస్తూ ఫేజ్-4ను 100 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘లైఫ్ సైన్సెస్ రంగంలో 2035 నాటికి $25B పెట్టుబడుల లక్ష్యంగా ప్లాన్ రూపొందించాం. Trident AI కంపెనీ (US) ₹300CR, Rx Propellant ₹1000CR పెట్టుబడి పెడుతున్నాయి. Opella (France) కంపెనీ ముందుకొచ్చింది. AI ఆధారిత డ్రగ్స్ డిస్కవరీలో యువతకు శిక్షణ ఇప్పిస్తాం’ అని బయో ఆసియా-2026 సదస్సులో తెలిపారు.