News August 14, 2025

పెబ్బేరు: బైక్ నుంచి రూ.2.20 లక్షలు చోరీ: SI

image

పార్కింగ్ చేసిన బైక్ టూల్ బాక్స్ నుంచి రూ.2.20లక్షలు చోరీ చేసిన ఘటన బుధవారం పెబ్బేరులో జరిగింది. శ్రీరంగాపూర్‌కు చెందిన ఆంజనేయులు పెబ్బేరు SBIలో డబ్బులు డ్రా చేసి బైక్ టూల్ బాక్స్‌లో ఉంచారు. బీజేపీ క్యాంపులో బైక పార్క్ చేసి అధికారిని కలిసి తిరిగి వచ్చేవరకు నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.

Similar News

News August 15, 2025

HYD: జాతీయ జెండా ఆవిష్కరించిన మేయర్ విజయలక్ష్మి

image

ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేయర్ మాట్లాడుతూ.. మన అందరి నినాదం జాతీయత అయి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

News August 15, 2025

పుట్టపర్తిలో జెండా ఎగురవేసిన మంత్రి

image

పుట్టపర్తిలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రిని కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ చూపిన అధికారులకు అవార్డులు అందజేశారు.

News August 15, 2025

తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుంది: రేవంత్

image

TG: త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘RRR, రీజినల్ రింగ్ రైల్వే లైన్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇవి వస్తే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది. ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. వెయ్యేళ్లు ప్రజలు చెప్పుకునేలా మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ ఉంటాయి. యావత్ దేశం చూపు TG వైపు ఉండేలా చేస్తాం’ అని HYDలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో CM అన్నారు.