News April 4, 2025

పెబ్బేర్: ప్రతిభ చాటిన ఆకాశ్‌కు కలెక్టర్ అభినందనలు

image

పెబ్బేర్ మండలం వైశాఖాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచారు. వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈర్లదిన్నె ఆకాశ్ అనే విద్యార్థి గురుకుల ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ అతడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భీమ్‌సాగర్, ప్రిన్సిపల్ రిజో బాబు, అస్మత్ పాల్గొన్నారు. 

Similar News

News July 7, 2025

సంగారెడ్డి: కొత్త ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు

image

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు ప్రభుత్వ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వైద్య విధాన పరిషత్ డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. జిల్లాలలోని తెల్లాపూర్, కంగ్టి, గుమ్మడిదల-నర్సాపూర్ జాతీయ రహదారి మధ్య ట్రామా కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

News July 7, 2025

‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

image

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.

News July 7, 2025

‘నేడు స్కూళ్లకు సెలవు’ అని మీకు మెసేజ్ వచ్చిందా?

image

TG: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు యాజమాన్యాలు ఇవాళ సెలవును ప్రకటించాయి. ‘మొహర్రం సెలవు’ అంటూ పేరెంట్స్‌ ఫోన్లకు మెసేజులు పంపించాయి. రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పబ్లిక్ హాలిడే ఆదివారం రోజే ఉంది. అటు పలు స్కూళ్లు మాత్రం ఇవాళ సెలవు లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపాయి. దీంతో కొందరిలో గందరగోళం నెలకొంది. మరి మీకు సెలవు మెసేజ్ వచ్చిందా? కామెంట్.