News December 13, 2025
పెరగనున్న కార్ల ధరలు

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బెంజ్ వచ్చే ఏడాది JAN 1 నుంచి కార్ల ధరలు పెంచనుంది. 1-2% మేర పెరుగుదల ఉంటుందని తెలిపింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని చెప్పలేదు. యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను పెంచాల్సి వస్తోందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయంతో పాటు లాజిస్టిక్ ఖర్చులూ అధికం అవడాన్ని కారణాలుగా తెలిపింది.
Similar News
News December 18, 2025
కుంకుమ సువాసన, రంగు కూడా ఆరోగ్యమే

నుదిటిపై కుంకుమ ధరించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే! అయితే దాని వాసన, రంగుతో కూడా ఆరోగ్యపరంగా మనకెన్నో లాభాలున్నాయని పండితులు చెబుతున్నారు. ‘కుంకుమ సువాసన మన శరీరంలో సానుకూల శక్తిని పెంచుతుంది. దీని ఎరుపు రంగు సంపూర్ణ అగ్ని సూత్రాన్ని సూచిస్తుంది. నుదిటిపై కుంకుమ ధరించడం భౌతిక సుఖాల పట్ల నిర్లిప్తతను పెంచి, అంతిమ చైతన్యం వైపు మనల్ని నడిపించేందుకు సహాయపడుతుంది’ అని అంటున్నారు.
News December 18, 2025
HURLలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన్ లిమిటెడ్(HURL)లో 33 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెక్నికల్ అప్రెంటిస్కు డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు BE, B.Tech, B.Com, BBA, BSc ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. అప్రెంటిస్లు NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://hurl.net.in
News December 18, 2025
తిరుమలలో రాజకీయ బ్యానర్లపై TTD స్పందన

AP: తిరుమలలో <<18601703>>రాజకీయ పోస్టర్<<>> కలకలం రేపిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నాయకుల ఫొటోలతో ఉన్న బ్యానర్ ప్రదర్శించడంపై TTD స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించామని పేర్కొంది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.


