News September 24, 2025

పెరవలి ఘటనపై మంత్రి దుర్గేష్ స్పందన

image

పెరవలిలో ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. ఈ ఘటనలో సలాది సత్యనారాయణ మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుని కుటుంబానికి ఆర్టీసీ నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

Similar News

News September 25, 2025

తూ.గో: హోమ్ స్టేలను ప్రోత్సహించండి: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి హోమ్ స్టేలను ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికలు రచించాలని ఆదేశించారు.

News September 24, 2025

రాజమండ్రి సెంట్రల్ జైలు తనిఖీ

image

రాజమండ్రి సెంట్రల్ జైలును బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం బుధవారం సాయంత్రం సందర్శించింది. ఈ బృందంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా న్యాయసేవాధికారి కార్యదర్శి ఎన్. లక్ష్మి, ఎస్పీ నరసింహ కిషోర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు జైల్లో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను, వారు ఉండే బ్యారక్‌లను పరిశీలించారు.

News September 24, 2025

అక్టోబర్ 15న తూర్పు గోదావరి రెడ్‌క్రాస్ ఎన్నికలు

image

రాజమండ్రి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు అక్టోబరు 15న నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన ఈ ఎన్నికలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యత్వం ఉన్న పేట్రన్, వైస్ పేట్రన్, లైఫ్ మెంబర్స్ ఈ ఎన్నికలకు హాజరు కావాలని సూచించారు.