News December 27, 2025

పెరిగిన ట్రైన్ ఛార్జీలు.. RGM-సికింద్రాబాద్‌‌కు ఎంతంటే..?

image

రైల్వే శాఖ రైళ్ల ఛార్జీలను పెంచింది. 215 KMలకు పైగా ట్రావెల్ చేసేవారిపై KMకు పైసా చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 224 KMల దూరమున్న రామగుండం- సికింద్రాబాద్‌(భాగ్యనగర్‌, ఇంటర్‌సిటీ) ట్రైన్లకు మొన్నటివరకు రూ.90 టికెట్ ధర ఉండగా పెరిగిన ధరతో అది రూ.95కు చేరింది. ఇక సూపర్‌ఫాస్ట్‌ ఛార్జ్ రూ.110గా ఉంది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. PDPL-సికింద్రాబాద్‌కు పాత ఛార్జీలే.

Similar News

News December 28, 2025

ప్రకాశం జిల్లాకు సక్రమంగా సాగర్ జలాలు వచ్చేనా..?

image

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.

News December 28, 2025

Silver.. సారీ..! Stock లేదు!

image

వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్స్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది. ఒకవేళ అక్కడక్కడా ఉన్నా 10గ్రా, 15g, 20g బార్స్ తప్ప వందలు, వేల గ్రాముల్లో లేవని చెబుతున్నారు. ఆర్డర్ పెడితే 4-7 రోజులకు వస్తుందని, ఆరోజు ధరకే ఇస్తామంటున్నారు. మీకూ ఇలా అయిందా? కామెంట్.

News December 28, 2025

మెదక్: సండే స్పెషల్.. నాటు కోళ్లకు డిమాండ్

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సండే సందడి కనిపిస్తోంది. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్‌ దుకాణాలకు దారి తీస్తున్నారు. బాయిలర్ కోడి కంటే నాటుకోడి రుచిగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది వాటిపైనే మక్కువ చూపుతున్నారు. బాయిలర్ రూ.200, మటన్ రూ.800, నాటుకోడి ధర రూ.800 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతోంది. మీ ప్రాంతాల్లో ధర ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.