News April 23, 2025

‘పేదరికం నుంచి బయటకి వచ్చేలా అవగాహన కల్పించాలి’

image

బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకి తెచ్చేలా అవగాహన కల్పించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. పి4 అమలు తీరుపై జిల్లా, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం, వారి భవిష్యత్తు అభివృద్ధిపై ప్రణాళికతో అవగాహన కల్పించడం ముఖ్యమని కలెక్టర్ చెప్పారు.

Similar News

News April 24, 2025

SRD: ‘పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి’

image

విద్యారంగా సమస్యలపైన బుధవారం విద్యా శాఖ కార్యదర్శి యోగితా రానా ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషి తప్పనిసరి అని, పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహ రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన, అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

News April 24, 2025

కామారెడ్డి: ఇంటర్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్

image

కామారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీ వారు నిర్వహిస్తున్న టెక్‌-బీ ప్రోగ్రాం కింద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసుకున్న ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బైపీసీ, ఒకేషనల్ కంప్యూటర్స్ చదివిన విద్యార్థులకు ఈనెల 24న ఉదయం 9 గంటలకు ఆర్కే డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో మెగా జాబ్ మేళా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి రాజేశ్ తెలిపారు.

News April 24, 2025

దేశీయ HPV కిట్లు త్వరలో విడుదల: జితేంద్ర

image

సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన <<15380344>>HPV<<>> కిట్లను త్వరలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అందుబాటు ధరలో టీకాలు, టెస్టులు, ట్రీట్‌మెంట్ చేయడమనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘సర్వైకల్’ మృతుల్లో 25% INDలోనే నమోదవుతున్నాయని చెప్పారు. చికిత్స ఆలస్యమవడం వల్లే ఇలా జరుగుతోందని, వైద్య సేవల అందించడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు.

error: Content is protected !!