News March 4, 2025
పేదరిక జిల్లాగా ఉమ్మడి అనంతపురం

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.
Similar News
News March 4, 2025
VKB: స్పోర్ట్స్ స్కూల్లో దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి వాటర్ స్పోర్ట్స్ అకాడమిలో కాయకింగ్, కెనోయింగ్, ఫెన్సింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్ నందు గిరిజన బాలబాలికల నుంచి అడ్మిషన్లు కోరుతున్నామని ఆ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు. 5వ తగరతిలో బాలురు10, బాలికలకు 10 సీట్లు ఉండగా, మిగతా 6,7,8 తరగతిలో మిగిలిన సీట్లకు ఈ నెల 9 వరకు కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 4, 2025
అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

పాల్వంచ వర్తక సంఘ భవనం పక్కన రేగా లక్ష్మి-రవీందర్ దంపతులు గతేడాది నుంచి నివాసముంటున్నారు. భార్యపై అనుమానంతో గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. స్థానికులు వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2025
జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నిలిపేసింది: మంత్రి నిమ్మల

AP: పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. జగన్ సర్కార్ ప్రాజెక్టును నిలిపేసిందని, డయాఫ్రంవాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. 2025 కల్లా పోలవరం ఎడమ కాలవ పనులు పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు.