News March 10, 2025

పేదల జీవన ప్రమాణాలు మెరుగు కోసం పీ4 సర్వే: జేసీ

image

పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి పి4 సర్వే ఎంతగానో దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. బాపట్ల కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (P4)తో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి అనే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తుందన్నారు.

Similar News

News February 22, 2026

నల్గొండ: ఉపాధి కోసం ప్రాణాలు పోతున్నాయ్..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రసాయన పరిశ్రమలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. చౌటుప్పల్, పోచంపల్లి మండలాల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కాలుష్యంతో ఇప్పటికే నరకం చూస్తున్న జనం, ఇప్పుడు ఈ పేలుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో సుమారు 150 వరకు రసాయన పరిశ్రమలు ఉండగా అందులో అత్యధికం CPL, పోచంపల్లి మండలాల్లోనే ఉన్నాయి.

News February 22, 2026

తగ్గిన చికెన్ రేట్లు

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. విజయవాడలో కేజీ స్కిన్ లెస్ కోడి మాంసం రూ.200 పలుకుతోంది. గుంటూరులో రూ.190, నరసరావుపేటలో రూ.230కి విక్రయిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కేజీ చికెన్ రేట్ రూ.230-250 మధ్య సేల్ చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రూ.240-260గా ఉంది. మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయి?

News February 22, 2026

నేడు కామారెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

image

కామారెడ్డిలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కామారెడ్డికి రానున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు వర్గాలు తెలిపాయి. నిన్న అనివార్య కారణాలవల్ల రాలేకపోయారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే రమణారెడ్డితో భేటీ కానున్నారు. ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను తెలుసుకోనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.