News October 21, 2025

పేదల సంక్షేమం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

image

రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి(M) ధర్మతండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల వలే నడిపిస్తున్నామని చెప్పారు. పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్‌ పాల్గొన్నారు.

Similar News

News October 21, 2025

VKB: పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: ఎస్పీ

image

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ప్రజలకు ఉన్నత సేవలు అందించే వారు పోలీసులని, వారి సేవలను వెలకట్టలేమని ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి మాట్లాడారు. అమరుల త్యాగాలు మరువలేనివని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.

News October 21, 2025

స్పామ్ మెసేజ్‌ల నియంత్రణకు వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

image

స్పామ్ మెసేజ్‌ల నియంత్రణకు WhatsApp ఓ ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్లు లేదా బిజినెస్ అకౌంట్స్ నుంచి అన్‌నోన్ నంబర్లకు పంపే బ్రాడ్‌కాస్ట్ మెసేజ్‌లకు లిమిట్ విధించనుంది. కొత్త నంబర్లకు మెసేజ్‌లు పంపినప్పుడు వారి నుంచి రిప్లైలు రాకపోతే ఆ మెసేజ్‌లన్నీ లిమిట్ లిస్టులో యాడ్ అవుతాయి. ఒక్కో మంత్‌లో నిర్దేశించిన లిమిట్‌కి చేరగానే మళ్లీ మెసేజ్‌లు పంపేందుకు వీలుండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది.

News October 21, 2025

KTR, హరీశ్ ‘హైదరాబాద్ యాత్ర’..!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో KTR, హరీశ్‌రావు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేయడానికి ఇద్దరు నాయకులు ‘హైదరాబాద్ యాత్ర’లో ఉన్నారు. HYDRAA, Musi ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలతో దీపావళిని జరుపుకున్న తర్వాత KTR, హరీశ్ ఈరోజు బస్తీ దవాఖానలను సందర్శించారు. 2026 ప్రారంభంలో GHMC ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున వారు సిటీపై మరింత ఫోకస్ పెట్టారు.