News December 23, 2025
పేపర్ లెస్ పరిపాలన అందించాలి: డీఎంహెచ్వో

జిల్లా పరిధిలో ఈ-ఆఫీస్ డిజిటల్ సేవల ద్వారా పేపర్ లెస్ పరిపాలన అందించాలని డీఎంహెచ్వో డా.కృష్ణమూర్తి నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సాంకేతికతను పూర్తిగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతిక ఫైళ్లకు బదులుగా డిజిటల్ ఫైళ్లు నిర్వహించాలన్నారు.
Similar News
News December 24, 2025
భారత్ అండర్-19 జట్టుపై ICCకి ఫిర్యాదు చేస్తాం: పాక్

అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్ టీమ్ తీరుపై ICCకి కంప్లైంట్ చేయనున్నట్టు PCB, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చెప్పారు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమ్ఇండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నారు. పాలిటిక్స్, స్పోర్ట్స్ను వేరుగా చూడాలి. భారత ఆటగాళ్ల తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాను’ అని తెలిపారు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో అండర్-19 ఆసియా కప్ను పాక్ గెలుచుకుంది.
News December 24, 2025
జగిత్యాల జిల్లాలో పెరిగిన హత్యలు: ఎస్పీ

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో హత్యల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగిందని తెలిపారు. 2023లో 28 హత్యలు జరగగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 29 హత్యలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే, మిగతా నేరాల రేటు గత సంవత్సరం కంటే 5 శాతం తగ్గినట్లు వివరించారు. ఈ క్రమంలో సహకరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
News December 24, 2025
కోరుట్ల: భార్యాభర్తల పై దురుసుగా ప్రవర్తించిన నలుగురిపై కేసు

కోరుట్ల పట్టణ శివారులోని పెద్ద గుండు దగ్గర గ్రౌండ్ లో మంగళవారం మద్యం సేవించి తాగిన మత్తులో భార్యాభర్తల పై దురుసుగా ప్రవర్తించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అడ్డుగా వచ్చిన భర్త పైన దాడి చేసిన సంఘటనలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


