News July 29, 2024
పేరుకే బహుళార్థక సాధక ప్రాజెక్టు.. నిర్వహణకు నిధులు నిల్.?

కృష్ణానదిపై నిర్మించిన రెండో అతిపెద్ద ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు.అప్పటి ప్రధాని నెహ్రూ ముందుచూపు ఏపీ తొలి సీఎం నీలం సంజీవరెడ్డి ఆలోచన ఇంజినీర్ల మేథోశక్తి కలగలిపిన అద్భుత కట్టడం. ‘నేడు నిర్వాహణకు కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో అరకొర నిధులు మంజూరయ్యాయి. గ్రీజుకు కూడా అధికారులు డబ్బులు పెట్టుకునే దుస్థితి వచ్చింది. లిఫ్ట్ కూడా పనిచేయటం లేదు’ పలువురు విమర్శిస్తున్నారు.
Similar News
News February 22, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు గమనిక!

కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ అర్జీలు స్వీకరిస్తామన్నారు. గతంలో సమర్పించిన ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రజలు 1100 కాల్ సెంటర్ను సంప్రదించాలని ఆమె సూచించారు.
News February 22, 2026
కర్నూలు KV సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద మృతి

నంద్యాల సమీపంలోని పొన్నాపురం వద్ద రైలు పట్టాలపై బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు శనివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు బేతంచెర్లకు చెందిన విజయ్ కుమార్(27)గా గుర్తించారు. కర్నూలులోని KV సుబ్బారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News February 22, 2026
కర్నూలులో జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు 810 ఓవర్ స్పీడ్, 642 హెల్మెట్ లేని కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. 270 సెల్ ఫోన్ డ్రైవింగ్, 1,187 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 2,137 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయన్నారు.


