News December 3, 2024
పేరెంట్ -టీచర్ మీటింగ్ పండుగలా జరగాలి: కలెక్టర్

ఈనెల 7వ తేదీన జరిగే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని, కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.
Similar News
News January 8, 2026
కే. అగ్రహరంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్

సంక్రాంతి పండగను పురస్కరించుకొని కె. అగ్రహారం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి జిల్లాస్థాయి సీటీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సునీల్, షరీఫ్ తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన జట్లు రూ.700 ఎంట్రీ ఫీజు చెల్లించి ఈనెల 8 లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. విజేతలకు మొదటి బహుమతి రూ.50,116, రెండో బహుమతి 25,116 అందజేస్తామన్నారు.
News January 8, 2026
అర్ధవీడులో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్

సంక్రాంతి, రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఈనెల 10న అర్ధవీడులో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.25,000, రెండో బహుమతి రూ.15,000 మూడో బహుమతి రూ.8000లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ టోర్నమెంట్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
News January 8, 2026
మీ సమస్యలను సీఎంకు చెబుతా: గొట్టిపాటి

ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.


