News April 18, 2025
పేరేచర్ల- కొండమోడు నేషనల్ హైవే పనులు వేగం

పేరేచర్ల- కొండమోడు నేషనల్ హైవే నిర్మాణం జోరందుకుంది. కేంద్రం భూసేకరణ పరిహారంగా రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.43 కోట్లు జమ చేసింది. మొత్తం రూ.88 కోట్లలో ఇదివరకు చెల్లింపులు మొదలయ్యాయి. వివాదాల్లేని భూములకు పరిహారం చెల్లింపుతో భూసేకరణ ప్రక్రియకు ఊపొచ్చింది. 49.9 కిలోమీటర్ల విస్తరణ పనులు రూ.881 కోట్లతో కాంట్రాక్టర్కు అప్పగించగా, భారత్మాల కింద గ్రీన్ సిగ్నల్ రావడంతో పనులు ప్రారంభ దశలోకి వచ్చాయి.
Similar News
News April 19, 2025
విజయసాయికి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

AP: వైసీపీ కోటరీ వేధింపులు భరించలేకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారు. కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదా? కోటరీని ఎవరు నడిపారో ఆయనకు తెలియదా? మా పార్టీలో ఒకటి నుంచి వంద వరకు జగనే’ అని స్పష్టం చేశారు. తమ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని తేల్చి చెప్పారు.
News April 19, 2025
జగిత్యాల: పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టండి: ఎస్పీ

గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులల్లో ఈతకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. శనివారం జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. సరదా కోసం ఈతకు వెళ్తే కొందరు ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు జరిగాయని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఈత నేర్చుకునే పిల్లలు తల్లిదండ్రులతో వెళ్ళాలన్నారు.
News April 19, 2025
10 రోజుల్లో రూ.4,200 పెరిగిన గోల్డ్ రేటు

శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత పది రోజుల్లోనే తులం బంగారంపై రూ.4,200లు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. అయితే, మూడు రోజులకే టారిఫ్స్ హోల్డ్ చేయడంతో రాకెట్లా దూసుకెళ్లాయి. ఈనెల 10న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,380 ఉండగా ఇవాళ అది రూ.97,580కి చేరింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.89,450గా ఉంది.