News October 16, 2025
పైడితల్లి అమ్మవారి ఆదాయం రూ.50.13లక్షలు

విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగకు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి కళ్యాణ మండపంలో బుధవారం లెక్కించారు. హుండీలో రూ.50,13,221 నగదు, 35.3గ్రాముల బంగారం, 421గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ శిరీష చెప్పారు. దేవాదాయ శాఖధికారులు, పోలీసులు సమక్షంలో హుండీని లెక్కించారు. లెక్కింపులో అధికారులు, భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News October 16, 2025
వనపర్తి: 24 గంటలు నమోదైన వర్షపాత వివరాలు

వనపర్తి జిల్లాలో ఉన్న 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటలో నాలుగు కేంద్రాలలో వర్షపాతం నమోదయింది. అత్యధికంగా జానంపేటలో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. శ్రీరంగాపురం 6.8 మిల్లీమీటర్లు, పెబ్బేరు 4.8 మిల్లీమీటర్లు, దగడలో 1.8 మిల్లీమీటర్లు, మిగతా 17 కేంద్రాలలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 16, 2025
ఇంటర్ విద్యార్థులు వివరాలు సరిచూసుకోవాలి: DIEO

ఆసిఫాబాద్ జిల్లాలోని ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ పూర్తి వివరాలను ఆన్లైన్ చెక్ లిస్టులతో సరిచూసుకోవాలని DIEO రాందాస్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఈ సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. విద్యార్థులు https://tgbie.cgg.gov.in/svc.do లింక్ ద్వారా నేరుగా తమ వివరాలు, ఫొటో, సంతకం వంటివి పరిశీలించుకోవచ్చన్నారు. ఏవైనా తప్పులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
News October 16, 2025
రాజోలి: బండేనక బండి సుంకేసులకు గండి

రాజోలిలోని సుంకేసుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. బుధవారం ఎద్దుల బండ్లతో గంగమ్మ గుడి, పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో టిప్పర్ యజమానులు ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇటీవల అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేశారు. ఇసుక అక్రమ నిల్వలు ఏర్పాటు చేస్తున్న వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.