News October 10, 2024

పైడితల్లి జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

image

విజయనగర ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోయేలా నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏర్పాట్లను చూసి అధికారులతో మాట్లాడిన తర్వాత ఉత్సవాలు ఘన విజయం అవుతాయనే నమ్మకం కలిగిందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి బుధవారం సమీక్షించారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని సూచించారు.

Similar News

News November 5, 2025

పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలి: VZM SP

image

పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ దామోదర్ కోరారు. విజయనగరం ఎస్పీ కార్యాలయం నుంచి బుధవారం రీసెప్షనిస్టలుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ సమస్యలపై స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్నారు. ఫిర్యాదు రాయడం రానివారికి సిబ్బందే సాయం చేయాలని ఆదేశించారు.

News November 5, 2025

పోష‌కాహారాన్ని స‌కాలంలో అందించాలి: VZM JC

image

జిల్లాలోని 2,499 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సకాలంలో అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎస్‌.సేథుమాధవన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. సరుకుల సరఫరాలో జాప్యం లేకుండా, నాణ్యమైన బియ్యం, పప్పు, నూనె అందించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ డైరెక్టర్ విమల రాణి, సివిల్ సప్లయిస్ డీఎం శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News November 5, 2025

VZM: పీజీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్

image

ఏయూ పీజీ పరీక్షలలో ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. మంగళవారం ప్రారంభమైన పీజీ పరీక్షల్లో విజయనగరం జిల్లా ఎస్.కోట చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు రాసిన ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు విశ్వవిద్యాలయంకి వెళ్లిన తనిఖీ బృందం గుర్తించింది. దీంతో ఈ విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఏ.యూ స్పష్టం చేసింది.