News November 20, 2025
పొంచి ఉన్న ప్రమాదం

ధర్మవరం పట్టణం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారి మోటమర్ల గ్రామం వద్ద కల్వర్టుపై రక్షణ గోడలు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కల్వర్టుపై ఎదురెదురుగా వాహనాలు వచ్చిన సమయంలో కాలువలోకి పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలని కోరారు.
Similar News
News March 27, 2026
నీట్కు ప్రిపేర్ అవుతూ..ఉగ్రవాదులతో సంబంధం పెట్టుకొని జైలుకెళ్లాడు

విజయవాడ ఉగ్రకేసులో తాజాగా అరెస్టైన షాద్మాన్ నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతూ తీవ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాట్నా(బిహార్)కు చెందిన షాద్మాన్ పేరెంట్స్ టీచర్స్ కాగా.. వారు పేదలకు ఉచితంగా చదువు చెబుతూ స్థానికంగా గౌరవప్రదంగా జీవిస్తున్నారు. షాద్మాన్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి ల్యాప్టాప్, మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు.
News March 27, 2026
తిరుపతి: రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడి మృతి

పాకాల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడని RPF చిత్తూరు SI ధర్మేందర్ రాజు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 25 ఏళ్లు ఉంటుంది. తెలుపు రంగు నల్ల గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. తిరుపతికి వెళ్తున్న రైల్లో నుంచి జారి పడినట్లు అనుమానిస్తున్నారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 27, 2026
పెంటగాన్లో పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. ఏం జరగబోతోంది?

US రక్షణ కార్యాలయం పెంటగాన్ చుట్టుపక్కల <<18781285>>పిజ్జా ఆర్డర్లు<<>> పెరిగితే ఏదో ఒక దేశానికి మూడినట్లేనని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. తాజాగా పాపా జాన్స్ ఆర్డర్లు 296%, డొమినోస్ 208%, పిజాటో ఆర్డర్లు 200% పెరిగాయి. పశ్చిమాసియాకు US మరిన్ని బలగాలను పంపనుందనే వార్తల నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. ‘కొన్ని గంటల్లో కీలక ప్రకటన’ అంటూ వైట్హౌస్ చేసిన ట్వీట్ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. అసలేం జరగబోతోంది?


