News January 21, 2026
పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.
Similar News
News February 24, 2026
జింబాబ్వే ఘోర ఓటమి

T20 WCలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఘోరంగా ఓడిపోయింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ZIM 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఏ దశలోనూ ఛేదన దిశగా సాగలేదు. ముగ్గురు డకౌట్ అయ్యారు. చివర్లో ఇవాన్స్(43) కాసేపు మెరుపులు మెరిపించారు. మోతీ 4, హొసీన్ 3, ఫోర్డె 2, హోల్డర్ ఒక వికెట్ తీశారు.
News February 24, 2026
ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్న్యూస్

TG: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1.2 కోట్ల పరిహారం ఇవ్వనుంది. 60 ఏళ్లలోపు సహజ మరణానికి ₹10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. 7.57 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తించనుంది. క్యాష్లెస్ EHS అమలు చేయాలని నిర్ణయించింది.
News February 24, 2026
మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ!

తెలంగాణ మావోయిస్ట్ క్యాడర్ DGP శివధర్ రెడ్డి సమక్షంలో రేపు లొంగిపోనున్నట్లు సమాచారం. కీలక నేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లారాజిరెడ్డి, చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి అస్త్ర సన్యాసం చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో 15 మంది లొంగిపోనున్నారట. దీంతో TG మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారుతుందని పోలీసులు చెబుతున్నారు. రేపు దీనిపై DGP అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు.


