News March 20, 2024

పొత్తులకు సహకారం లభించేనా?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించారు. తిరుపతిలో అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈక్రమంలో తమకు సీటు రాలేదంటూ కొందరు సహకరించడం లేదని తెలుస్తోంది. సీటు దక్కిన వారు సైతం ఇతర పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరడం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి విజయం సాధించాలంటే తప్పకుండా అన్ని పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే విజయావకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Similar News

News November 7, 2025

స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

image

ఇటీవల తుఫాను ధాటికి చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.

News November 6, 2025

దూడపై చిరుతపులి దాడి.?

image

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News November 5, 2025

చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జట్టు ఇదే..!

image

చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక సదుంలో బుధవారం జరిగింది. ధరణీధర, బాలాజీ, భరత్ కుమార్, మహేంద్ర, సుధీర్(సదుం), వెంకటేశ్, ప్రసన్నకుమార్, ప్రిన్స్ (నిండ్ర), సతీష్(పలమనేరు), హర్షవర్ధన్(ఏఎన్ కుంట), నిఖిల్(దిగువమాఘం), ప్రవీణ్ కుమార్ (చిత్తూరు), సుశీల్ (సిద్ధంపల్లె), గోకుల్(అరగొండ), ప్రవీణ్ కుమార్ నాయక్(పీలేరు) ఎంపికైనట్లు నిర్వాహకులు చెప్పారు.