News September 28, 2024

పొదిలి: జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక

image

మార్కాపురంలో ఈ నెల 25న జరిగిన నియోజకవర్గం స్థాయి స్కూల్ గేమ్స్‌లో పొదిలి విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. వాలీబాల్ అండర్ -17, అండర్-14 విభాగంలో విజయం సాధించి జిల్లా వాలీబాల్ టీంకి అండర్ -17లో పి. చరణ్, డి. హర్షవర్ధన్ పి. బ్రహ్మ చరణ్, అండర్ -14 విభాగంలో ఏ.సాత్విక్, వ. జీవన్ చందులు ఎంపికైనట్లు ఆ పాఠశాల పీడీ కె. స్టీఫెన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Similar News

News February 3, 2026

చీరాలలో హత్య కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్

image

చీరాలలో గత నెల 27న రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ కింద జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చీరాల వన్ టౌన్ సీఐ సుబ్బారావు స్టేషన్ వద్ద మంగళవారం వివరాలు వెల్లడించారు. నిందితులు ఓ మహిళ విషయంలో జరిగిన ఘర్షణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు వివరించారు.

News February 3, 2026

ప్రకాశం: యాక్సిడెంట్.. విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థి వి. గాలెయ్య మృతి చెందగా మరో యువకుడు గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. కొలుకుల నుంచి ఎర్రగొండపాలేనికి వస్తున్న సమయంలో వరి కోత వాహనం ఢీకొని అక్కడిక్కడే గాలెయ్య మృతి చెందగా.. సండ్రపాటి నాని (16) గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.

News February 3, 2026

ఒక్క మాటతో IPS.. కనిగిరి వాసి సక్సెస్ స్టోరీ..!

image

“నా తర్వాతి సివిల్స్ విజేత ఇతనే” అని పదేళ్లక్రితం IPS ఆవుల రమేశ్‌‌రెడ్డి ఓ వేదికపై చెప్పినమాట అక్షర సత్యమైంది. పవన్ కుమార్‌ రెడ్డి 179వ ర్యాంకుతో ఆంధ్రాలో IPSకు ఎంపికయ్యారు. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు. అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే నాలుగో ప్రయత్నంలో IPS సాధించారు. డాక్టర్ అవ్వాలనుకున్న ఈయన IPS రమేశ్ రెడ్డి ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించారు.