News June 16, 2024
పొదిలి: నిద్రమాత్రలు మింగిన ANM

పొదిలిలోని పి.హెచ్.సిలో పనిచేస్తున్న ANM విజయ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటిసిబ్బంది గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న ఓ ఆశ కార్యకర్తకు ANM విజయకు గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ నిద్రమాత్రలు మింగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Similar News
News February 3, 2026
ప్రకాశం: యాక్సిడెంట్.. విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థి వి. గాలెయ్య మృతి చెందగా మరో యువకుడు గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. కొలుకుల నుంచి ఎర్రగొండపాలేనికి వస్తున్న సమయంలో వరి కోత వాహనం ఢీకొని అక్కడిక్కడే గాలెయ్య మృతి చెందగా.. సండ్రపాటి నాని (16) గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
News February 3, 2026
ఒక్క మాటతో IPS.. కనిగిరి వాసి సక్సెస్ స్టోరీ..!

“నా తర్వాతి సివిల్స్ విజేత ఇతనే” అని పదేళ్లక్రితం IPS ఆవుల రమేశ్రెడ్డి ఓ వేదికపై చెప్పినమాట అక్షర సత్యమైంది. పవన్ కుమార్ రెడ్డి 179వ ర్యాంకుతో ఆంధ్రాలో IPSకు ఎంపికయ్యారు. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు. అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తూనే నాలుగో ప్రయత్నంలో IPS సాధించారు. డాక్టర్ అవ్వాలనుకున్న ఈయన IPS రమేశ్ రెడ్డి ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించారు.
News February 3, 2026
ప్రకాశం: అరుదైన అవార్డు అందుకున్న డీడీ డా.జగత్ శ్రీనివాస్

ప్రకాశం జిల్లా పశు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న డాక్టర్ జగత్ శ్రీనివాస్కు అరుదైన అవార్డు వరించింది. జాతీయస్థాయిలో అందించే డాక్టర్ సీఎం సింగ్ సుశ్రుత గౌరవ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వారిలో డీడీ జగత్ శ్రీనివాస్ ఒకరు. ఈ సందర్భంగా ఏపీ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు ఈయనకు సర్టిఫికెట్లను బహుకరించి ఘనంగా సన్మానించారు.


