News September 22, 2024
‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈనెల 24 నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులు, జేసీ స్వరాజ్తో కలిసి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి సంబంధించిన గొడ పత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారుల సమన్వయంతో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 22, 2024
ముఖ్యమంత్రి ఆదేశాలతో బాలుడికి మెరుగైన వైద్యం
విజయవాడకు చెందిన చీకుర్తి స్వాతికి మూడేళ్ల దేవాన్ష్ అనే బాలుడు ఉన్నాడు. ఆగస్టు 31వ తేదీన బాలుడికి తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన సీఎం, మంత్రి లోకేశ్ బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం బాలుడు దేవాన్ష్ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
News September 22, 2024
గుంటూరు: భర్త అనుమానంతో వేధిస్తున్నాడు
భర్త అనుమానంతో వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. వరగానికి చెందిన వీరయ్యకు గుంటూరుకు చెందిన రాణితో 10ఏళ్ల క్రితం పెళ్లైంది. ఎవరితో మాట్లాడినా అనుమానంతో వేధిస్తున్నాడంటూ, మద్యం తాగి వచ్చి తరచూ.. గొడవపడి తన్నుతున్నాడని, మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
News September 22, 2024
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు: గుంటూరు ఎస్పీ
నగరంలోని పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలతో శనివారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య, మైనర్లు డ్రైవింగ్ నడపడం తదితర అంశాలపై విద్యాసంస్థల ప్రతినిధులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎస్పీ మైనర్లు వాహనాలు నడిపితే తల్లితండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంస్థల వద్ద పోలీసు భద్రత పెంచుతామని సూచించారు.