News December 2, 2025
పొలాల్లో మద్యం సీసాలు వేయొద్దు: ఎస్పీ నరసింహ

మద్యం తాగి ఖాళీ సీసాలను కాలువలు, పంట పొలాల్లో వేయడం వల్ల పొలం పనులు చేసే రైతులకు, కూలీలకు గాయాలవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని ఎస్పీ నర్సింహ తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించడం, ఖాళీ సీసాలను పంట పొలాల్లో పడవేయడం మంచి లక్షణం కాదని సూచించారు. పాఠశాలల పరిసరాల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News April 15, 2026
కరీంనగర్లో ఠాగూర్ సీన్ రిపీట్..!

KNRలో ఠాగూర్ సినిమాలోని సీన్ రిపీటైంది. వేములవాడ(M) శాత్రాజ్పల్లికి చెందిన సాహెబ్ బీ(60) గుండెవ్యాధితో కోర్టు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నిన్న సర్జరీ చేయగా మృతిచెందింది. బతికే ఉన్నట్లు, వైద్యం చేస్తున్నట్లు కుటుంబసభ్యులను మభ్యపెడుతుండగా, అనుమానంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు వచ్చి శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. డాక్టర్లపై KNR-2 టౌన్ PSలో కేసు నమోదైంది.
News April 15, 2026
నేడు ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కల్లూరులో CHC ప్రారంభం, పెనుబల్లిలో ఏర్పాటు చేసే ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతుల కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం వేంసూరు మండలంలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు.
News April 15, 2026
WGL: ఆరు స్థానాలు పెరగడం పక్కా!

ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 6 కొత్తవి రావడం పక్కాగా తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 35,12,576 మంది కాగా, 17,59,772 పురుషులు, 17,53,295 మహిళలున్నారు. ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా, కొత్తవి 6 రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉన్న 12 స్థానాల్లోని జనరల్ స్థానాలన్నీ మహిళలకు, రిజర్వు స్థానాలు జనరల్గా మారడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటి నుంచే నేతలు వాటిపై గురి పెడుతున్నారు.


