News November 30, 2025
పోచంపల్లిలో అత్యల్ప ఉష్ణోగ్రత

ఉమ్మడి నల్గొండ జిల్లాలో శీతల గాలులు వీస్తున్నాయి. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. శనివారం ఉదయం యాదాద్రి జిల్లా పోచంపల్లిలో అత్యల్పంగా 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ చర్లపల్లిలో 12.6, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడ్డకట్టించే వాతావరణం ఉండటంతో నిత్యావసరాల కోసం తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.
Similar News
News April 14, 2026
GNT: న్యూడ్ వీడియో కాల్స్ గుట్టురట్టు.. ఇద్దరు మహిళల అరెస్ట్!

గుంటూరు(D) తెనాలిలోని చెంచుపేట కేంద్రంగా సాగుతున్న న్యూడ్ వీడియో కాల్స్ దందా కలకలం రేపుతోంది. ఓ యాప్ వేదికగా నగదు చెల్లించిన వారికి మహిళలతో నగ్నంగా వీడియో కాల్స్ చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ వ్యవహారంలో చెంచుపేటకు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అశ్లీల దందా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
News April 14, 2026
మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
News April 14, 2026
భగ్గుమంటున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. సోమవారం జగిత్యాల జిల్లా కథలాపూర్లో అత్యధికంగా 42.8℃, సారంగాపూర్లో 42.6℃ ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపురం, సిరిసిల్లలో 42.5℃, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి 42.4, గంగాధరలో 42.1, పెద్దపల్లి జిల్లా సుగ్లంపల్లి 41.7, ఆకెనపల్లిలో 41.6℃ ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. తీవ్రమైన ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


