News January 24, 2025

పోచంపల్లిలో కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ పర్యటన

image

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ అశోక్ కుమార్ జైస్వాల్ పర్యటించారు. ఈ సందర్భంగా చేనేత పరిశ్రమలు, చేనేత షాపులను పరిశీలించారు. చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలను అందజేస్తుందని తెలిపారు.

Similar News

News April 14, 2026

విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్లు ప్రారంభం

image

విద్యార్థులకు, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో Vishwa Vishwani Institute of Systems and మేనేజ్మెంట్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నూతనంగా BS Computer Science (UGC AEDP) కోర్సును ప్రారంభించారు. ఈ 4 సంవత్సరాల ప్రోగ్రామ్‌లో 2 ఏళ్లు క్యాంపస్‌లో చదువు, తదుపరి 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో అప్రెంటిషిప్ శిక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 14, 2026

పోచంపల్లి: చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

పోచంపల్లి మండలం గౌస్‌కొండలో విషాదం నెలకొంది. చెరువులో సరదాగా షికారుకు వెళ్లి గల్లంతైన శివ అనే యువకుడి మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. ఆరుగురు స్నేహితులు నాటు పడవపై వెళ్తుండగా, పడవలోకి నీరు చేరడంతో ప్రమాదం సంభవించింది. ప్రాణభయంతో అందరూ నీటిలోకి దూకగా, ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈత రాని శివ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం దొరకడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News April 14, 2026

జగిత్యాల: భవన నిర్మాణ కూలీగా ప్రభుత్వ టీచర్

image

11 ఏళ్లు వీఆర్‌ఏగా పనిచేసిన JGTL(D) కొడిమ్యాల (M) చెప్యాలకు చెందిన లక్ష్మీరాజం, ఉపాధ్యాయుడిగా ఎంపికై ఎనిమిది నెలలకే ఆ కొలువు కోల్పోయారు. ఆర్‌సీఐ వెరిఫికేషన్ సమస్యతో అధికారులు ఆయన్ను తొలగించడంతో, ప్రస్తుతం కుటుంబ పోషణకు భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. అటు పాత ఉద్యోగం లేక, ఇటు టీచర్ కొలువు పోయి రోడ్డున పడ్డానని, తనకు న్యాయం చేయాలని ఆయన సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను వేడుకున్నారు.