News August 10, 2025

పోరంకిలో చిన్నారులను ఆశీర్వదించిన సీఎం

image

పోరంకి శ్రీలక్ష్మీ నరసింహ గార్డెన్స్‌లో అడుసుమిల్లి వారి నూతన వస్త్రబహుకరణ వేడుక ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై చిన్నారులకు ఆశీర్వాదాలు అందించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్పీ ఆర్. గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 3, 2025

కృష్ణా జిల్లా రైతులకు శుభవార్త

image

కృష్ణా జిల్లాలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా గుజరాత్ నుంచి వస్తుందని అధికారులు తెలిపారు. బుధవారం 1,200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. పకడ్బందీగా యూరియా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. పాస్ బుక్ ఉన్న రైతులకు 25 కేజీల యూరియా సరఫరా చేయనున్నారు.

News September 3, 2025

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

image

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.

News September 3, 2025

పాపవినాశనం ఇసుక రీచ్‌పై ఈ-టెండర్లు

image

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్‌ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.